న్యూఢిల్లీ: ఢిల్లీలో సోమవారం పార్సిల్ బాంబు పేలింది. ఈ పేలుడులో ఒక వ్యక్తి గాయపడ్డాడు. ఈ సంఘటన ఢిల్లీలోని జామియా నగర్ లో సోమవారం సాయంత్రం సంభవించినట్లు పోలీసులు చెప్పారు. కొరియర్ సర్వీస్ బాయ్ మొహమ్మద్ ఉజైర్ అనే వ్యక్తికి పార్సిల్ ఇచ్చి వెళ్లిపోయాడు.
ఆ పార్సిల్ ను ఉజైర్ తెరవగానే బాంబు పేలింది. ఈ పేలుడులో అతను గాయపడ్డాడు. అతన్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఇది ఉగ్రవాద చర్య కాదని పోలీసులు అంటున్నారు.