ఆదరణకు తండ్రినే మర్చిపోతున్నా: జగన్

మార్టేరు, పేకేరు, తణుకు, తాడేపల్లిగూడెం, అనంతపల్లి, యర్నగూడెం, దేవరపల్లి, కొవ్వూరు తదితర ప్రాంతాలన్నింటిలోను మార్గం వెంబడే జనం కిక్కిరిసి నిలబడ్డారు. తన యాత్రలో బాధితులను ఓదార్చేందుకే ఆదివారం ఎక్కువ సమయం కేటాయించిన జగన్ తన ప్రసంగ పాఠాన్ని మాత్రం కుదించారు. రెండురోజులపాటు రాజకీయ పరంగా చర్చ రేకెత్తించే విధంగా వ్యాఖ్యలు చేసిన ఆయన ఆదివారం మాత్రం దీనికి భిన్నంగా మూడు నుంచి ఐదు నిమిషాలలోపే అన్ని చోట్ల ప్రసంగించి వివాదాలకు తావులేకుండా జాగ్రత్త వహించారు. మూడు రోజులపాటు జిల్లాలో ఓదార్పు యాత్ర సాగిస్తున్న జగన్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్, ముఖ్యమంత్రి కె.రోశయ్యతోసహా స్థానిక నేతల పేర్లను కూడా ఎక్కడా ప్రస్తావించకుండా కేవలం తన తండ్రి చేసిన పనులను మాత్రమే ప్రస్తావించి సరిపెట్టారు. ప్రభుత్వ పథకాలు చేపట్టడంలో తన తండ్రి రాజశేఖరరెడ్డి నమ్మకంగా వ్యవహరించారంటూ పలుచోట్ల చెప్పారు. బాధిత కుటుంబాలను ఓదారుద్దామని జిల్లాకు వస్తే ఇక్కడి వారంతా తననే ఓదారుస్తున్నారని, దీనికి ఏమి రుణం ఇచ్చి తీర్చుకుంటానంటూ ప్రశ్నలు కురిపించారు. జగన్ వెంబడి మంత్రులు వసంతకుమార్, పితాని సత్యనారాయణతోపాటు స్థానిక ఎమ్మెల్యేలు నియోజకవర్గాల వారీగా ఓదార్పు యాత్రలో పాలుపంచుకుంటున్నారు.












Click it and Unblock the Notifications