వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెద్ద పథకాల్లో లోపాలు సహజం: సిఎం

By Pratap
|
Google Oneindia TeluguNews

Rosaiah
మహబూబ్ నగర్: పెద్ద యెత్తున పథకాలు అమలు జరిపినప్పుడు చిన్న చిన్న లోపాలు సహజమని ముఖ్యమంత్రి కె. రోశయ్య అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ లో ఆయన బుధవారం ఐదో విడత భూపంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. చిన్నపాటి లోపాలను భూతద్దంలో చూపడం సరి కాదని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ప్రభుత్వ పథకాల అమలుకు ప్రతిపక్షాలు సహకరించాలని ఆయన కోరారు.

భూపంపిణీ పథకం పేదల జీవితాల్లో వెలుగు నింపుతుందని ఆయన అన్నారు. వ్యవసాయానికి అనుకూలంగా లేని భూములను సేద్య యోగ్యంగా చేసుకోవడానికి జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వాడుకోవాలని ఆయన లబ్ధిదారులకు సూచించారు. భూముల పట్టాలను మహిళల పేరు మీద నమోదు చేయాలని ఆయన సూచించారు. మొత్తం లక్షా 615 ఎకరాల భూములను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాద రావు కూడా పాల్గొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X