అన్ని చూశాకే థరూర్ పై చర్యలు: పిఎం

Manmohan Singh
న్యూఢిల్లీ: అన్ని విషయాలు పరిశీలించిన తర్వాతనే విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి శశి థరూర్ వివాదంలో తగిన నిర్ణయం తీసుకుంటామని ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ చెప్పారు. రాజకీయాల్లో ఎత్తుపల్లాలు ఉండవని ఆయన అన్నారు. విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తక్షణ అభిప్రాయానికి రావడం సరైంది కాదని ఆయన అన్నారు. దీన్ని బట్టి శశిథరూర్ విషయంలో ప్రధాని సమయం తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లు అర్థమవుతోంది.

ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ శనివారం సాయంత్రం కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని, ఇతర సీనియర్ నాయకులను కలిసే అవకాశం ఉంది. తగిన సమయంలో ప్రధాని మన్మోహన్ శశి థరూర్ విషయంలో నిర్ణయం తీసుకుంటారని కాంగ్రెసు వర్గాలు చెప్పాయి. ప్రస్తుతానికి శశి థరూర్ ను ప్రధాని వదిలేయవచ్చునని తెలుస్తోంది. మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ సమయంలో ఆయనను తప్పించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+