జగన్ లో వైయస్ ను చూస్తున్నారు: వెంకటరెడ్డి

YS Jaganmohan Reddy
ఖమ్మం: తమ కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిలో ఆయన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డిని ప్రజలు చూసుకుంటున్నారని రాష్ట్ర మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. జగన్ తో పాటు ఓదార్పు యాత్రలో పాల్గొంటున్న ఆయన గుండ్రాతిమడుగులో శనివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఇప్పటి వరకు ఖమ్మం జిల్లాలో వందకు పైగా వైయస్ విగ్రహాలను ఆవిష్కరించినట్లు ఆయన తెలిపారు.

గ్రామగ్రామాన తమ అభిమాన నేత వైయస్ రాజశేఖర రెడ్డిని ప్రజలు విగ్రహాల్లో చూసుకుంటున్నారని ఆయన అన్నారు. భవిష్యత్తు యువతదేనని, వైయస్ జగన్ కు మంచి భవిష్యత్తు ఉందని ఆయన అన్నారు. ఖమ్మం జిల్లాలో జగన్ ఓదార్పు యాత్ర శనివారం కూడా కొనసాగింది. జగన్ కు తెలంగాణ వాదుల నుంచి అడ్డంకులు ఎదురవుతున్నాయి. అయితే పోలీసులు తెలంగాణవాదులను అరెస్టు చేస్తూ జగన్ యాత్రకు ఆటంకం కలగకుండా చూస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+