జగన్ కు పిసిసి ఇవ్వాల్సిందే: మారెప్ప
దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలను కొనసాగించడంలో ఆయన సఫలీకృతులవుతున్నారన్నారు. అదేవిధంగా వైయస్ జగన్ కు కూడా పీసీసీ అధ్యక్ష పదవిని కట్టబెడితే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెసు పార్టీకి ఎదురులేకుండా పోతుందని అన్నారు. తెలంగాణ ఉప ఎన్నికల్లో వృద్ధులకు కాకుండా యువతరానికి, గెలుపు గుర్రాలకు టిక్కెట్లు ఇవ్వాలని ఆయన కోరారు. మంత్రాలయం నియోజకవర్గంలో వృద్ధుడికి టిక్కెట్ ఇవ్వడం వల్లే అక్కడ కాంగ్రెసు పార్టీ ఓటమి పాలు కావాల్సి వచ్చిందన్నారు.
Comments
Story first published: Friday, April 30, 2010, 9:03 [IST]