వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముంబై రైలు సర్వీసుల స్తంభన

By Pratap
|
Google Oneindia TeluguNews

Mumbai
ముంబై‌: మోటార్ మెన్ సమ్మెతో ముంబైలో రవాణా వ్యవస్థ స్తంభించింది. దీంతో వేలాది మంది ముంబై ప్రజలకు ఇళ్లకు తిరిగి వెళ్లిపోతున్నారు. మంగళవారం 15 శాతం రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి. మోటార్ మెన్ సమ్మె రెండో రోజుకు చేరుకుంది. వేతనాలు పెంచాలని, తగిన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ మోటార్ మెన్ సమ్మెకు దిగారు. సమ్మె చేస్తున్న 20 మంది మోటార్ మెన్ ను డిస్మిస్ చేశారు.

ప్రయాణికుల కోసం ముంబైలో అదనపు బస్సులు నడుపుతున్నారు. అత్యవసర సర్వీసు నిర్వహణ చట్టాన్ని (ఎస్మాను) అమలు చేసే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. స్థానిక స్టేషన్లలో రాష్ట్ర సాయుధ బలగాలను మోహరించారు. మొత్తం 1200 రైళ్లలో 200 మాత్రమే నడుస్తున్నాయి. నిరాహార దీక్ష చేస్తూ రైళ్లను నడుపుతామని సోమవారం ఉదయం చెప్పిన మోటార్ మెన్ ఆ తర్వాత రైళ్లను నడపడానికి కూడా నిరాకరించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X