'తెలంగాణ ప్రజలారా! సినిమాలు చూడకండి'

Kodandaram
హైదరాబాద్: తెలంగాణపై వివక్ష పోయేంతవరకు సినిమాలు చూడవద్దని జెఎసి కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్ పిలుపు ఇచ్చారు. సినీ పరిశ్రమలో తెలంగాణపై వివక్షతతోపాటు సీమాంధ్రుల పెట్టుబడిదారుల ఆధిపత్యం కొనసాగుతోందని కోదండరామ్‌ అన్నారు. కళాకారులు పేర్లను నమోదు చేయడానికి సినీ పరిశ్రమకు లక్ష రూపాయల డిపాజిట్‌ చేయాలన్న నిబంధన ఆధిపత్య ధోరణికి నిదర్శనమన్నారు. బషీర్‌ బాగ్‌ ప్రెస్ ‌క్లబ్‌ లో తెలంగాణ చిత్రపరిశ్రమ ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో 'తెలంగాణలో చిత్ర పరిశ్రమ అభివృద్ధి' అనే అంశంపై సదస్సుకు కోదండరామ్‌ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

ఆధిపత్యానికి వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమం కొనసాగుతుందని, తెలంగాణ కళాకారులకు సినిమాల్లో అవకాశాలు రాకుండా అణగదొక్కుతున్నారని విమర్శించారు. ఈ వివక్షత పోయే వరకు తెలంగాణ ప్రజలు సినిమాలు చూడవద్దని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజల జీవితం కథా వస్తువు సినిమాల్లో కనిపించడంలేదని, యాస, భాషను మాత్రం కించపరుస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ధూంధాం కళాకారుడు రసమయి బాలకృష్ణ మాట్లాడుతూ సినీ పరిశ్రమలో దోపిడీ కొనసాగుతుందని, అసలైన తెలంగాణ కళాకారులకు స్థానం లేదన్నారు.

నటుడు కాంతారావు తెలంగాణ కు చెందిన వారు కావడం వల్లే ఆయన గురించి సినీ ప్రముఖులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తెలంగాణ మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సి.వి.ఎల్‌.నర్సింహారావు మాట్లాడుతూ తెలంగాణ సినిమాను ఆవిష్కరించుకున్నప్పుడే దోపిడీ అణిచివేత, వివక్షత అంతమవుతుందన్నారు. తెలంగాణ చిత్ర పరిశ్రమ జేఏసీ కన్వీనర్‌ జి.హన్మంతరావు మాట్లాడుతూ చిన్న నిర్మాతలను అణిచివేస్తున్నారని, అశ్లీలతతో కూడిన సినిమాలు చిన్నారుల హృదయాల్లో తీవ్ర ప్రభావం చూపుతున్నాయని అభిప్రాయపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+