హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హరికృష్ణ లేఖతో తెలంగాణ నేతల తంటా

By Pratap
|
Google Oneindia TeluguNews

Harikrishna
హైదరాబాద్: తెలంగాణలో సీమాంధ్ర నేత పర్యటనలను అడ్డుకుంటామనే ప్రకటనలను వ్యతిరేకిస్తూ తమ పార్టీ రాజ్యసభ సభ్యుడు హరికృష్ణ రాసిన లేఖతో తెలుగుదేశం పార్టీ తెలంగాణ నేతలు ఇరకాటంలో పడ్డారు. కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ తెలంగాణ పర్యటనను అడ్డుకుంటామని తమ పార్టీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు చేసిన ప్రకటనపై హరికృష్ణ తీవ్రంగా ప్రతిస్పందించారు. అలా అడ్డుకోవడం సరి కాదని ఆయన అన్నారు. ఎర్రబెల్లి ప్రకటనను తప్పు పట్టారు. పైకి గంభీరంగా మాట్లాడుతున్నప్పటికీ తెలుగుదేశం తెలంగాణ నాయకుల్లో గుబులు రేగుతోంది.

హరికృష్ణ ప్రకటనపై ఎర్రబెల్లి దయాకర రావు ప్రతిస్పందించారు. తెలంగాణ పరిస్థితులను హరికృష్ణకు వివరిస్తామని ఎర్రబెల్లి దయాకర రావు అన్నారు. వ్యవహారంపై హరికృష్ణతో మాట్లాడుతామని ఆయన అన్నారు. జగన్ పర్యటనను అడ్డుకోవాలనే తమ నిర్ణయంలో మార్పు లేదని ఆయన ప్రకటించారు. హరికృష్ణ లేఖపై పార్టీ మరో తెలంగాణ నేత నాగం జనార్దన్ రెడ్డి కూడా ప్రతిస్పందించారు. ఆ విషయం హరికృష్ణతోనే మాట్లాడుతామని ఆయన చెప్పారు. అయితే హరికృష్ణ వైఖరి తెలుగుదేశం తెలంగాణ నేతలకు రుచించడం లేదు. కానీ, ఏమీ చేయలేని స్థితి కూడా ఉంది. హరికృష్ణ స్వర్గీయ ఎన్టీ రామారావు కుమారుడు, పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి బావమరిది కావడం వారి ఇబ్బందికి కారణం. మిగతా సీమాంధ్ర నేతల ప్రకటనలపై ప్రతిస్పందించిన రీతిలో హరికృష్ణ ప్రకటనపై స్పందించే సాహసం తెలంగాణ నేతలకు లేదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X