జగన్ తెలంగాణ యాత్ర ఉంటుందా?

జగన్ వరంగల్ జిల్లా పర్యటన వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలగవచ్చునని నిఘా విభాగం అంచనా వేస్తోంది. ఈ మేరకు నిఘా విభాగం రాష్ట్ర ప్రభుత్వానికి ఓ నివేదికను అందజేసింది. జగన్ పర్యటనను వ్యతిరేకిస్తూ మంగళవారం జెఎసి నిర్వహించిన బంద్ సంపూర్ణంగా జరిగింది. తెలుగుదేశం శాసనసభ్యుడు ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా జగన్ పర్యటనను అడ్డుకుంటామని ప్రకటించారు. దీంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా జగన్ యాత్రకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. శాసనసభ్యురాలు కొండా సురేఖ, ఎమ్మెల్సీ మురళీధర రావు మాత్రం జగన్ ఓదార్పు యాత్రను విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నారు. ఈ స్థితిలో జగన్ ఓదార్పు యాత్ర జరుగుతుందా, లేదా అనేది సందేహంగా మారింది.












Click it and Unblock the Notifications