వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ తెలంగాణ యాత్రపై వీరప్ప మొయిలీ 'నో' కామెంట్

By Pratap
|
Google Oneindia TeluguNews

Veerappa Moily
న్యూఢిల్లీ: వైయస్ జగన్ శుక్రవారం నుంచి వరంగల్ జిల్లాలో తలపెట్టిన ఓదార్పు యాత్రపై మాట్లాడడానికి కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ నిరాకరించారు. తానేమీ చెప్పలేనని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు. జగన్ యాత్రను వాయిదా వేయించాలని మొయిలీపై తెలంగాణకు చెందిన కాంగ్రెసు పార్లమెంటు సభ్యుల నుంచి మొయిలీపై ఒత్తిడి పెరుగుతోంది.

జగన్ తెలంగాణ యాత్రను ఆపాలని ఇంతకు ముందే ఐదుగురు పార్లమెంటు సభ్యులు మొయిలీని మంగళవారం కలిసి కోరారు. గురువారం ఉదయం వరంగల్ జిల్లాకు చెందిన పార్లమెంటు సభ్యుడు రాజయ్య కూడా మొయిలీని కలిసి జగన్ యాత్రను ఆపాలని కోరారు. జగన్ యాత్ర జరగకపోవచ్చునని మొయిలీని కలిసిన తర్వాత రాజయ్య మీడియా ప్రతినిధులతో అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X