పద్మావతి ఎక్స్ ప్రెస్ కు నిప్పు పెట్టిన జగన్ ఫ్యాన్స్
జగన్ అభిమానుల ఆగ్రహానికి పద్మావతి ఎక్స్ ప్రెస్ రైలుకు చెందిన రెండు బోగీల్లో మంటలు లేచాయి. ఎస్ -10 బోగీ పూర్తిగా దగ్ధం కాగా, ఎస్ - 11 బోగీ పాక్షికంగా దెబ్బ తిన్నది. ఈ సంఘటనలో ఏ విధమైన ప్రాణ నష్టం జరగలేదు. రీషెడ్యూల్ సమయంలో జగన్ అభిమానులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఆ సమయంలో ప్రయాణికులు ఎవరూ రైల్లో లేరు. దీంతో ప్రాణ నష్టం జరగలేదు. పైర్ ఇంజన్లు వచ్చి మంటలను ఆర్పాయి. జగన్ అభిమానుల చర్య వల్ల తిరుపతిలో భయానక వాతావరణం నెలకొంది.
Comments
Story first published: Friday, May 28, 2010, 17:39 [IST]