తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పద్మావతి ఎక్స్ ప్రెస్ కు నిప్పు పెట్టిన జగన్ ఫ్యాన్స్

By Pratap
|
Google Oneindia TeluguNews

Padmavathi Express
తిరుపతి: కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు తిరుపతిలో శుక్రవారం విధ్వంసానికి దిగారు. జగన్ అరెస్టు వార్త విన్న వెంటనే వారు చెలరేగిపోయారు. దుకాణాలపై దాడులకు దిగారు. రైల్వే స్టేషనులో ఆగి ఉన్న పద్మావతి ఎక్స్ ప్రెస్ రైలుకు నిప్పు పెట్టారు. ఓ ఆర్టీసి బస్సును కూడా దగ్ధం చేశారు. దుకాణాలపై దాడులు చేశారు. దీంతో తిరుపతి ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. తిరుమల వచ్చిన భక్తులను కూడా వారు వదిలిపెట్టలేదు.

జగన్ అభిమానుల ఆగ్రహానికి పద్మావతి ఎక్స్ ప్రెస్ రైలుకు చెందిన రెండు బోగీల్లో మంటలు లేచాయి. ఎస్ -10 బోగీ పూర్తిగా దగ్ధం కాగా, ఎస్ - 11 బోగీ పాక్షికంగా దెబ్బ తిన్నది. ఈ సంఘటనలో ఏ విధమైన ప్రాణ నష్టం జరగలేదు. రీషెడ్యూల్ సమయంలో జగన్ అభిమానులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఆ సమయంలో ప్రయాణికులు ఎవరూ రైల్లో లేరు. దీంతో ప్రాణ నష్టం జరగలేదు. పైర్ ఇంజన్లు వచ్చి మంటలను ఆర్పాయి. జగన్ అభిమానుల చర్య వల్ల తిరుపతిలో భయానక వాతావరణం నెలకొంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X