హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ తెలంగాణ యాత్ర: రోశయ్య, సబితల మధ్య విభేదాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Sabitha Indra Reddy
హైదరాబాద్: కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వరంగల్ జిల్లా ఓదార్పు యాత్ర ముఖ్యమంత్రి కె. రోశయ్యకు, హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డికి మధ్య చిచ్చు పెట్టింది. ఇరువురి మధ్య తీవ్ర విభేదాలు చోటు చేసుకున్నాయి. జగన్ యాత్ర సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత మీదేనంటూ రోశయ్య సబితా ఇంద్రారెడ్డిపై భారం మోపేందుకు ప్రయత్నించారు. అందుకు సబితా ఇంద్రారెడ్డి నిరాకరించినట్లు సమాచారం. శాంతిభద్రతల సమస్య ముఖ్యమంత్రి పరిధిలోనే ఉందని, దానితో తనకు సంబంధం లేదని సబితా ఇంద్రారెడ్డి కుండ బద్దలు కొట్టినట్లు సబితా ఇంద్రారెడ్డి రోశయ్యతో అన్నట్లు తెలుస్తోంది.

కాగా, యాత్రను వాయిదా వేసుకోవాలని నచ్చజెప్పేందుకు జగన్ వద్దకు వెళ్లాలని గురువారం మంత్రివర్గ సమావేశంలో రోశయ్య సబితా ఇంద్రారెడ్డికి సూచించినట్లు తెలుస్తోంది. అయితే తాను ఒక్కతే వెళ్లడానికి ఆమె ఇష్టపడలేదని చెబుతున్నారు. దాంతో సబితా ఇంద్రారెడ్డి వెంట వ్యవసాయ శాఖ మంత్రి రఘువీరా రెడ్డి జగన్ నివాసానికి వెళ్లి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అయితే వారి మాటను జగన్ వినలేదు. జగన్ యాత్ర వల్ల సంభవించే పరిణామాలకు మంత్రులదే బాధ్యత అంటూ ముఖ్యమంత్రి రోశయ్య అప్పటికే చెప్పేశారు. అలా చెప్పేసి ఆయన ప్రకాశం జిల్లా పర్యటనకు వెళ్లిపోయారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X