వైయస్ జగన్ ను అడ్డుకుని తీరుతాం: కోదండరామ్

వైయస్ జగన్ యాత్రపై తెలంగాణ జాగృతి నేత కల్వకుంట్ల కవిత విరుచుకుపడ్డారు. తెలంగాణలోని పరిస్థితిని దృష్టిలో ఉంచుకోకుండా జగన్ యాత్ర సాగించడం సరైంది కాదని ఆమె అన్నారు. కాంగ్రెసు అధిష్టానం కూడా సీమాంధ్ర నేతలకు అనుకూలంగా వ్యవహిరిస్తోందని ఆమె విమర్శించారు. తన మాటను ధిక్కరిస్తే తెలంగాణ నాయకులపై చర్యలు తీసుకుంటున్న కాంగ్రెసు అధిష్టానం సీమాంధ్ర నేతలపై చర్యలు తీసుకోవడం లేదని ఆమె అన్నారు. అధిష్టానం వారించినా జగన్ వరంగల్ జిల్లా పర్యటనకు పూనుకున్నారని, అయినా ఏ విధమైన చర్యలు తీసుకోవడం లేదని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications