వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మావోయిస్టుల దాడిలో 15 మంది అమాయకుల బలి

By Santaram
|
Google Oneindia TeluguNews

Train Derailment
కోల్ ‌కతా: బెంగాల్ లో మావోయిస్టుల దాడిలో 15 మంది అమాయక ప్రజలు బలయ్యారు. పశ్చిమబెంగాల్‌ లో మావోయిస్టులు మళ్లీ పేట్రేగిపోయారు. పశ్చిమ మిడ్నాపుర్‌ జిల్లాలో జార్‌ గామ్‌ వద్ద రైల్వేపట్టాలను పేల్చివేశారు. దీంతో జ్ఞానేశ్వరి ఎక్స్ ‌ప్రెస్‌ పట్టాలు తప్పింది. ఖెమసోలి-సర్దియా స్టేషన్ల మధ్య గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 15మంది మృతి చెందారు. మరో 150మంది గాయపడ్డారు.

ఈ ప్రమాదం వివరాలు తెలియడంతోనే కేంద్రరైల్వే శాఖమంత్రి మమతాబెనర్జీ హుటాహుటీన సంఘటన స్థలానికి బయలుదేరారు. ఈ ప్రమాదంలోని బాధితుల వివరాలు తెలుకునేందుకు రెండు హెల్ప్‌లైన్లు ఏర్పాటు చేశారు. మృతుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ప్రమాదంలో గాయపడిన వారికి చికిత్స అందించేందుకు ఐదు వైద్యబృందాలు సంఘటన స్థలానికి బయలుదేరాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X