పథకం ప్రకారమే నన్ను అరెస్టు చేశారు: వైయస్ జగన్

తాను పరామర్సించడానికి వస్తే తెరాస ఎందుకు భయపడుతోందని ఆయన అడిగారు. ఇప్పటికైనా తెరాస కళ్లు తెరవాలని ఆయన అన్నారు. తాను రానేమోననే ఆందోళనతో ఆత్మహత్య చేసుకున్న యాదగిరికి, ఎల్లయ్యకు తాను సమాధానం చెప్పాల్సి ఉంటుందని, తన కన్నా ఎక్కువగా తెరాస సమాధానం చెప్పాల్సి ఉంటుందని ఆయన అన్నారు. తెరాస ప్రజలను భయపెడుతోందని ఆయన విమర్శించారు. స్థానికేతరులైన హరీష్ రావు, ఈటెల రాజేందర్, కోదండరామ్ మహబూబాబాద్ ఎందుకు వచ్చారని ఆయన అడిగారు. వారు వచ్చి ప్రజలను రెచ్చగొట్టారని ఆయన ఆరోపించారు. వారు క్షుద్రరాజకీయాలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తాను మంచి కార్యక్రమం చేపడితే తెరాస రాజకీయం చేసి చేసిందని, బయటి నుంచి జనాలను రప్పించారని ఆయన అన్నారు. తెరాస ఇప్పటికైనా విజ్ఞత ప్రదర్శించాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications