హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ తో విభేదించిన ఎమ్మెల్యే కొండా సురేఖ

By Pratap
|
Google Oneindia TeluguNews

konda Surekha
హైదరాబాద్‌: తమ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ తో శాసనసభ్యురాలు కొండా సురేఖ విభేదించారు. వరంగల్ జిల్లా మహబూబాబాద్ లో జగన్ ఓదార్పు యాత్రను నిర్వహించేందుకు సర్వ శక్తులూ ఒడ్డిన సురేఖ ఇప్పుడు ఆయనతో విభేదించారు. మహబూబాబాద్ లో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, ముఖ్యమంత్రి కె. రోశయ్య రాళ్లు వేయించారని వైయస్ జగన్ ఆరోపించారు. అయితే, దానితో సురేఖ విభేదించారు.

మహబూబాబాద్ సంఘటనలో ముఖ్యమంత్రి కె. రోశయ్య వైఫల్యం ఏమీ లేదని కొండా సురేఖ మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. సరైన బందోబస్తు ఏర్పాట్లకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసినట్లు ఆమె తెలిపారు. తమకు ఇబ్బంది కలగకుండా ముఖ్యమంత్రి ఏర్పాట్లు చేశారని, అయితే స్థానికంగా కొంత సమాచార లోపం ఉంటే ఉండవచ్చునని ఆమె అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X