హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ వ్యాఖ్యలపై ఇప్పుడే ఏమీ మాట్లాడను: రోశయ్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్: తన ఓదార్పు యాత్ర సందర్భంగా ప్రజాప్రతినిధులకు రక్షణ కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని తమ కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించడానికి ముఖ్యమంత్రి కె. రోశయ్య నిరాకరించారు. జగన్ వ్యాఖ్యలపై ఇప్పుడే స్పందించబోనని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. జగన్ ఆరోపణల్లో నిజం ఉందా, లేదా అనే విషయాన్ని చూడాల్సి ఉందని ఆయన అన్నారు.

జగన్ చేసిన వ్యాఖ్యల్లో పొరపాటు ఏమైనా ఉందా, జగన్ అవగాహనా లోపం వల్ల మాట్లాడారా అనే విషయాలను పరిశీలించాల్సి ఉందని ఆయన అన్నారు. పరిస్థితులను అన్నింటినీ సమీక్షించిన తర్వాతనే తాను ఏమైనా మాట్లాడగలనని ఆయన అన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ ప్రభుత్వ బాధ్యత అని, శాంతిభద్రతలు బాగుంటేనే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయని, రాష్ట్రానికి పెట్టుబడులు రావాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X