కెవిపి రామచందర్ రావుపై వైయస్ జగన్ కోపం

KVP Ramachandar Rao
హైదరాబాద్: తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి ప్రియ మిత్రుడు, రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావుపై కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. కెవిపి అనుసరిస్తున్న వ్యూహం తనకు ఏ మాత్రం ప్రయోజనం కలిగించడం లేదనే అభిప్రాయంతో ఆయన ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. తనను ముఖ్యమంత్రి కాకుండా కెవిపి చేస్తున్నారనే అభిప్రాయం జగన్ లో గూడు కట్టుకుని పోయిందని అంటున్నారు. అందుకే ప్రస్తుతం కెవిపిని కూడా ఖాతరు చేయకుండా ముందుకు సాగుతున్నట్లు చెబుతున్నారు.

కెవిపి రామచందర్ రావు ముఖ్యమంత్రి కె. రోశయ్యకు సహకరిస్తున్నారని, దాని వల్ల రోశయ్య నిలదొక్కుకోకుండా ఎప్పటికప్పుడు ఆటంకాలు కల్పిస్తున్న వ్యూహాలు దెబ్బ తింటున్నాయని ఆయన భావిస్తున్నారని ఊహాగానాలు చెలరేగుతున్నాయి. తన వర్గానికి చెందిన పలువురు మంత్రులు ముఖ్యమంత్రికి సహకరించడంలో కెవిపి పాత్ర ప్రధానంగా ఉందని ఆయన అనుకుంటున్నట్లు చెబుతున్నారు. ఈ స్థితిలో జగన్ కెవిపిని దూరంగా పెట్టి తన వ్యూహరచనను అమలు చేస్తున్నట్లు చెబుతున్నారు. కర్నాటక మంత్రి గాలి జనార్దన్ రెడ్డి మార్గంలో పయనించాలనేది జగన్ వ్యూహమని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+