హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దట్స్ తెలుగు పోల్: కాంగ్రెసులో చిరు పార్టీ విలీనానికే మొగ్గు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: చిరంజీవి నాయకత్వంలోని ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెసులో విలీనం కావాలనే ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. దట్స్ తెలుగు నిర్వహించిన ఆన్ లైన్ పోల్ లో ఈ అభిప్రాయం వ్యక్తమైంది. చిరంజీవి కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసిన నేపథ్యంలో విలీనం ప్రస్తావన ముందుకు వచ్చింది. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేస్తారనే ప్రచారం చాలా కాలంగా జరుగుతోంది. అయితే, పార్టీని కాంగ్రెసులో విలీనం చేయబోమని చిరంజీవి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో దట్స్ తెలుగు ఆన్ లైన్ పోల్ నిర్వహించింది.

చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని విలీనం చేయాలని 52 శాతం మంది అభిప్రాయపడుతుండగా, విలీనం చేయకూడదని 43.8 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఏమీ చెప్పలేమన్నవారు కేవలం 3.36 శాతం మంది మాత్రమే ఉన్నారు. వారి అభిప్రాయానికి గల కారణాలను దట్స్ తెలుగు ప్రయత్నించలేదు. అందువల్ల ఈ అభిప్రాయం వ్యక్తం కావడానికి కారణాలను అన్వేషించాల్సి ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X