కడప జిల్లాలో టిడిపి నేతపై బాంబు దాడి: ఇద్దరు మృతి

Kadapa
కడప: కడప జిల్లాలో మరోసారి ఫ్యాక్షన్ కక్షలు పడగ విప్పాయి. జిల్లాలో సోమవారం మధ్యాహ్నం తెలుగుదేశం పార్టీ నాయకుడు వెంకటరెడ్డి లక్ష్యంగా ప్రత్యర్థులు బాంబులతో దాడి చేశారు. జిల్లాలోని కడప జిల్లాలోని ముద్దనూరు ఎంపిడివో కార్యాలయం ముందు ప్రత్యర్థులు మూడు నాటు బాంబులతో వెంకటరెడ్డిపై దాడి చేశారు. ఈ దాడి నుంచి వెంకటరెడ్డి సురక్షితంగా బయటపడ్డాడు. అయితే ఇద్దరు వ్యక్తులు మరణించగా, ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.

బాంబు దాడిలో కార్యాలయం గుమాస్తా అంకాలమ్మ, వెంకటరెడ్డి అనుచరుడు రామసుబ్బారెడ్డి మరణించారు. మరో కార్యాలయ గుమస్తా మునుస్వామి దాడిలో గాయపడ్డాడు. కోడగానిపల్లె గ్రామానికి చెందిన వెంకటరెడ్డి ప్రజా సమస్యలు వినిపించడానికి ఎంపిడివో కార్యాలయానికి వచ్చినప్పుడు ఈ దాడి జరిగింది. గ్రామకక్షలే ఈ దాడికి కారణమని అనుమానిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+