కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ ఓదార్పు యాత్రకు అనుమతివ్వాలి: పొన్నం ప్రభాకర్

By Pratap
|
Google Oneindia TeluguNews

Ponnam Prabhakar
కరీంనగర్: సీమాంధ్రలో తమ పార్టీ కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఓదార్పు యాత్రకు అనుమతివ్వాలని కాంగ్రెసు కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ పార్టీ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలోని ప్రత్యేక పరిస్థితి వల్ల ఈ ప్రాంతంలో జగన్ ఓదార్పు యాత్ర వద్దన్నామని, సీమాంధ్రలో జగన్ ఓదార్పు యాత్రకు అనుమతి ఇవ్వాలని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. దీనిపై ఇప్పటికే అధిష్టానానికి విజ్ఞప్తి చేశామని ఆయన చెప్పారు. ఇదే విషయంపై మరోసారి పత్రికా ముఖంగా విజ్ఞప్తి చేస్తున్నామని ఆయన అన్నారు.

బలహీనవర్గాలపై బిజెపి మొసలి కన్నీరు కారుస్తోందని ఆయన విమర్శించారు. ఫీజుల రీయంబర్స్ మెంటుపై బిజెపి చేపట్టిన ఆందోళనపై ఆయన ఆ విధంగా వ్యాఖ్యానించారు. తాను చేసిన ఆరోపణలు నిరాధారమైనవి అయితే ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకుడు హరీష్ రావు సిద్ధిపేట నుంచి కాకుండా సిరిసిల్ల నుంచి పోటీ చేయాలని ఆయన సవాల్ చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X