విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విజయవాడలో పాత నేరస్తుడి లాకప్ డెత్?

By Pratap
|
Google Oneindia TeluguNews

Vijayawada
విజయవాడ: విజయవాడలోని ఓ పోలీసు స్టేషనులో ఓ లాకప్ డెత్ జరిగింది. ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాలలో రెండు రోజుల క్రితం జరిగిన లాకప్ డెత్ సంఘటనను మరిచిపోక ముందే ఈ లాకప్ డెత్ సంభవించింది. శ్రీనివాస రెడ్డి అనే పాత నేరస్తుడ్ని దొంగతనం చేస్తుండగా స్థానికలుు పట్టుకుని సత్యనారాయణపురం పోలీసులకు అప్పగించారు. ఆ తర్వాత అతను అస్వస్థతకు గురయ్యాడు. దాంతో అతన్ని పోలీసులు అస్పత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ శ్రీనివాస రెడ్డి మరణించాడు.

పోలీసులే కొట్టి చంపారని శ్రీనివాస రెడ్డి బంధువులు ఆరోపిస్తున్నారు. స్థానికుల కొట్టడం వల్ల అతను చనిపోయాడని పోలీసులు వాదిస్తున్నారు. అయితే వైద్యుల అభిప్రాయం మరో రకంగా ఉంది. శ్రీనివాస రెడ్డి పురుగుల మంద తాగి మరణించినట్లు వైద్యులు చెబుతున్నారు. ఈ విషయాన్ని నిర్ధారించేందుకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X