వైయస్ జగన్ యాత్రకు మరో హెచ్చరిక: రోశయ్య ప్లాన్

కాగా, ముఖ్యమంత్రి కె. రోశయ్య కూడా జగన్ ఓదార్పు యాత్రకు చెక్ పెట్టేందుకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఆయన రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశంలో పాల్గొనడానికి రేపు బుధవారం ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. అయితే శాసనసభా సమావేశాలు ఉన్నందున తాను రాలేకపోతున్నట్లు కేంద్ర ప్రభుత్వానికి తొలుత తెలిపారు. ఓదార్పు యాత్ర చేపట్టేందుకు జగన్ సిద్ధం కావడంతో ఆయన మనసు మార్చుకున్నారు. బుధవారం శాసనసభా సమావేశాలు ముగిసిన వెంటవే హుటాహుటిన ఢిల్లీకి బయలు దేరి వెళ్లాలని ఆయన నిర్ణయించుకున్నారు. సమావేశం మిషతో జగన్ కు చెక్ పెట్టేందుకే మనసు మార్చుకుని ఆయన ఢిల్లీ వెళ్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.












Click it and Unblock the Notifications