ఓదార్పు యాత్రపై జగన్ ఆలోచనే వక్రం: తులసిరెడ్డి

Congress
హైదరాబాద్: ఓదార్పు యాత్ర విషయంలో తమ పార్టీ కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఆలోచనే సరి కాదని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధికార ప్రతినిధి తులసిరెడ్డి అన్నారు. తన ఓదార్పు యాత్రలో తన పక్కన మంత్రులు, శాసనసభ్యులు, వారి బంధువులు ఉండాలని జగన్ కోరుకోవడమే తప్పు అని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ఓదార్పు యాత్రలో బాధితులు, బాధిక కుటుంబాలవారు ఉండాలని కోరుకోవాలి గాని ప్రజాప్రతినిధులు ఉండాలని కోరుకోవడం సమంజసం కాదని ఆయన అన్నారు. యాత్రలో మంత్రులు, శాసనసభ్యులు ఉంటే అది ఓదార్పు యాత్ర కానే కాదని ఆయన అన్నారు.

రాజకీయాల్లో నైతిక విలువలు కొంత మేరకు దిగజారిన మాట వాస్తవమేనని, అయితే రాజకీయాలు తల దించుకుని సిగ్గుపడే స్థాయిలో లేవని ఆయన అన్నారు. సోనియా, మన్మోహన్ సింగ్, రోశయ్య వంటి నాయకులు రాజకీయాల్లో విలువలను నిలబెడుతున్నారని ఆయన అన్నారు. ఓదార్పు యాత్రను ఎవరూ వద్దన లేదని, హైకమాండ్ కూడా ఓదార్పు యాత్రను వద్దనలేదని ఆయన అన్నారు. జగన్ ఓదార్పు యాత్రలో పాల్గొనవద్దని ఎవరూ ఆదేశించలేదని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+