తూర్పు గోదావరి జిల్లా యాత్రలో తగ్గిన వైయస్ జగన్ వేడి

తుని నియోజకవర్గం ఎమ్మెల్యే రాజా అశోక్ బాబుతో పాటు కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, ప్రకాశం జిల్లా దర్శి ఎమ్మెల్యే బి.శివప్రసాద్ రెడ్డి, జడ్పీ ఛైర్మన్ వేణుగోపాలకృష్ణ సోమవారం యాత్రలో పాల్గొన్నారు. తెల్లవారుజామున జగన్ కు స్వాగతం పలికిన వారిలో ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు విశాఖ నుంచి విమానంలో హైదరాబాద్ వెళ్లారు. శ్రీకాకుళం జిల్లా యాత్రలో ఆ జిల్లాకు చెందిన ఒక్క ఎమ్మెల్యే కూడా పాల్గొనని నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లాలో ఐదుగురు ఎమ్మెల్యేలు స్వాగతం పలకడం, వారిలో సగంమంది జగన్ వెన్నంటి నడవడం పట్ల ఆయన సన్నిహితులు హర్షం వెలిబుచ్చుతున్నారు. ముద్రగడ పద్మనాభం, జక్కంపూడి రామ్మోహనరావు, మారెప్ప, తోట గోపాలకృష్ణ, వరుపుల రాజా తదితరులు యాత్రలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications