వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ జగన్ పై మావోయిస్టుల గురి : ఓదార్పు యాత్రలో మార్పులు

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
కాకినాడ: తూర్పు గోదావరి జిల్లాలో ఓదార్పు యాత్ర నిర్వహిస్తున్న కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ పై మావోయిస్టులు గురి పెట్టినట్లు తెలుస్తోంది. తన ఓదార్పు యాత్రలో భాగంగా గిరిజన ప్రాంతాలకు వచ్చినప్పుడు దాడి చేయాలని మావోయిస్టులు పథకం రచించినట్లు ఇంటిలిజెన్స్ వర్గాలకు సమాచారం అందింది. జగన్ పై దాడికి ప్రత్యేక టీమ్ ను ఏర్పాటు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మావోయిస్టులు రెండు రోజుల బంద్ కు పిలుపునిచ్చారు. దీంతో ఏజెన్సీ ప్రాంతంలో తన ఓదార్పు యాత్రను జగన్ రద్దు చేసుకున్నారు.

పోలీసు శాఖ సూచన మేరకు ఏజెన్సీలో తలపెట్టిన ఓదార్పు యాత్రను జగన్ పూర్తిగా రద్దు చేసుకోగా, 14, 15, 16 తేదీల యాత్రలో స్వల్ప మార్పులు కూడా చేసుకున్నారు. ఏజెన్సీ ప్రాంతంలోని బాధితులను జగన్ వారి ఇళ్ల వద్ద ఓదారుస్తారు. జగన్ ఓదార్పు యాత్రను నక్సలైట్లు చాలా సన్నిహితంగా పరిశీలిస్తున్నట్లు ఇంటిలిజెన్స్ వర్గాలకు సమాచారం అందింది. ఓ వ్యక్తి క్రమం తప్పకుండా జగన్ యాత్రకు వస్తుండడాన్ని వారు పసిగట్టి ఇప్పటికే కొన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నారని చెబుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X