నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సాలూర వద్ద ఉద్రిక్తత: శివసేన యాత్రతో గట్టి భద్రత

By Pratap
|
Google Oneindia TeluguNews

Rosaiah
నిజామాబాద్: సాలూర ప్రాజెక్టు తమ రాష్ట్రంలో ఉందంటూ శివసేన కార్యకర్తలు యాత్ర చేపట్టడంతో గురువారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దాంతో పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర సరిహద్దులు దాటి సాలూరలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నారు. వారిని అడ్డుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. పరిస్థితిని ముఖ్యమంత్రి కె. రోశయ్య హైదరాబాదులో సమీక్షించి అప్రమత్తంగా ఉండాలని పోలీసులను ఆదేశించారు. తాను మహారాష్ట్ర డిజిపితో మాట్లాడి శివసేన కార్యకర్తలను ఆంధ్రప్రదేశ్ లోకి రాకుండా చూడాలని కోరినట్లు డిజిపి గిరీష్ కుమార్ చెప్పారు. ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ వెంకటేశ్వర రావుతో కూడా ఆయన మాట్లాడారు.

తాను నాందేడ్ ఎస్పీ సందీప్ మాట్లాడినట్లు, శివసేన కార్యకర్తలు సరిహద్దు దాటి రాకుండా చూడాలని కోరినట్లు వెంకటేశ్వర రావు చెప్పారు. అనవసమైన ఆందోళనకు గురి కావద్దని ఆయన ప్రజలను కోరారు. సాలూర గ్రామ ప్రజలు కూడా ప్రాజెక్టు చెంతకు చేరుకున్నారు. అక్కడికి నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు మధు యాష్కీ కూడా వచ్చారు. మధు యాష్కీని స్థానిక ప్రజలు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. జై తెలంగాణ నినాదాలు చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X