కాంగ్రెసులో సరిరారు జగన్ కెవరు: అంబటి రాంబాబు
వైయస్ రాజశేఖర రెడ్డి లేని లోటు రాష్ట్రంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని ఆయన అన్నారు. ఉప ఎన్నికల ఫలితాలు సరైన నాయకత్వం లేని విషయాన్ని తెలియజేస్తాయని ఆయన అన్నారు. జగన్ వరంగల్ ఓదార్పు యాత్రను అడ్డుకోకపోతే కాంగ్రెసు మెరుగైన ఫలితాలు సాధించి ఉండేదని ఆయన అన్నారు. కాంగ్రెసు సీనియర్ నాయకులు కూడా జగన్ ఓదార్పు యాత్రను అడ్డుకోవడం బాధాకరమని ఆయన అన్నారు. జగన్ ఆ ప్రాంతంలో పర్యటించి ఉంటే ముఖ్యమంత్రి కె. రోశయ్య, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కూడా ఆ ప్రాంతంలో ఎన్నికల ప్రచారం చేయడానికి అవకాశం కలిగి ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రధాన నాయకులు కూడా ప్రచారానికి వెళ్లకపోవడం బాధాకరమని ఆయన అన్నారు. ఉప ఎన్నికల ఫలితాలు చూసి కాంగ్రెసు పార్టీ సీనియర్ నాయకులు ఆత్మవిమర్శ చేసుకోవాలని ఆయన అన్నారు. జగన్ కు పార్టీ పెట్టాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. రోశయ్య, డి. శ్రీనివాస్ పెద్ద నాయకులే అయినప్పటికీ వారిని వైయస్ రాజశేఖర రెడ్డితో పోల్చలేమని ఆయన అన్నారు.