హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రోశయ్యకు వయస్సుతో పాటు హుందాతనం పెరగలేదు: బాబు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. రోశయ్యకు వయస్సుతో పాటు హుందాతనం పెరగలేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. అన్ని అవమానాలు భరించి తాము ప్రధాని మన్మోహన్ సింగ్ వద్దకు బాబ్లీపై అఖిల పక్షంతో పాటు వెళ్లామని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. బాబ్లీపై ప్రధానితో అఖిలపక్ష భేటీలో సంబంధిత కేంద్రమంత్రిని లేదా అధికారిని అయినా ఆహ్వానించలేదని ఆయన విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే బాబ్లీ యాత్ర చేపట్టామని అన్నారు. బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తాము ఉద్యమం చేపట్టిన తర్వాత ఉప ఎన్నికలకు ప్రాధాన్యం ఇవ్వలేదని ఆయన చెప్పారు. ఉప ఎన్నికల్లో ఓడిపోయినా తమకు బాధ లేదని ఆయన అన్నారు. గతంలో ఉప ఎన్నికల్లో తాము మూడో స్థానానికి దిగజారామని, ఆ తర్వాత మళ్లీ పుంజుకున్నామని ఆయన గుర్తు చేశారు. మహారాష్ట్రలో తమను అరెస్టు చేసిన తర్వాత బాధకు 63 మంది మరణించారని, వారిని ఆదుకుంటామని ఆయన చెప్పారు.

బాబ్లీ ప్రాజెక్టు విషయంలో న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని ఆయన చెప్పారు. బాబ్లీ సమస్యపై జాతీయ స్థాయిలో అందరి మద్దతు కోరేందుకు తాము ఢిల్లీ వెళ్లామని ఆయన అన్నారు. ఢిల్లీలో బర్దన్, ప్రకాష్ కారత్, దేవెగౌడ, తంబిదురై తదితరులను కలిసినట్లు ఆయన తెలిపారు. మహారాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న 13 ప్రాజెక్టుల గురించి చెప్పి మద్దతు సంపాదించామని ఆయన అన్నారు. అఖిల పక్షం వస్తుందని తెలిసి కూడా ప్రధాని ఆ ప్రాజెక్టు గురించి తెలుసుకోలేదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X