కెసిఆర్ దాడికి టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు విరుగుడు

కెసిఆర్ ను రాజకీయంగా పైకి తెచ్చింది తానే అని ఆయన చెప్పుకున్నారు. మెదక్ రాజకీయాల్లో కరణం రామచందర్ రావు ప్రాబల్యం ఉన్నప్పటికీ తాను కెసిఆర్ ను ప్రోత్సహించానని ఆయన చెప్పారు. ఆనాడే కెసిఆర్ కు మంత్రి పదవి ఇచ్చి ఉంటే ఈ సమస్య వచ్చి ఉండేది కాదని ఆయన అన్నారు. ఇతర సమస్యల వల్ల తాను మంత్రి పదవి ఇవ్వలేదని, ఆనాడే మంత్రి పదవి ఇచ్చి ఉంటే పార్టీలో ఇబ్బందులు వచ్చి ఉండేవని, రాజకీయంగా ఇటువంటి సమస్యలు వచ్చి ఉండేవి కావని ఆయన అన్నారు. కెసిఆర్ కు అదే స్థాయిలో సమాధానం చెప్పాలని ఆయన పార్టీ నాయకులకు సూచించారు.
కెసిఆర్ వంచన రాజకీయాలకు పాల్పడుతున్నారని, కెసిఆర్ కు ఎదురు దెబ్బ తప్పదని ఆయన అన్నారు. సెంటిమెంటు పేరు చెప్పడమే గానీ తెలంగాణ సమస్యలు కెసిఆర్ కు పట్టడం లేదని ఆయన విమర్సించారు. తెలంగాణలో బలహిన పడిందని చెబుతూ కెసిఆర్ తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తున్నారని ఆయన అన్నారు. తాను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉంటే కెసిఆర్ ప్రశ్నిస్తున్నారని, కాంగ్రెసుకు ఇటాలియన్ అధ్యక్షురాలిగా ఉంటే ప్రశ్నించడం లేదని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని కెసిఆర్ టికెట్లు అమ్ముకున్న తీరు ప్రజలకు తెలిసిందేనని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీలో విలీనమవుతుందో, పొత్తు పెట్టుకుంటుందో తెలియని పరిస్థితి తెరాసదని ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications