వైయస్ జగన్ ఓదార్పుకు వైయస్ వివేకానంద రెడ్డి డుమ్మా

వైఎస్ జగన్ ఎదుగుదలను ఓర్వలేక ఓదార్పు యాత్రపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఆదివారం కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం చింతలచెరువు గ్రామంలో మద్దిలేటి గృహ ప్రవేశ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.సోనియా గాంధీ వద్ద మెప్పు పొందేందుకు కొందరు నాయకులు పని కట్టుకొని జగన్పై ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో అన్నారు. ఈ రోజుకు కూడా అధిష్టానం సలహా మేరకే నడుచుకుంటున్నామన్నారు. సినీయర్ నాయకుడు ప్రణబ్ ముఖర్జీ వ్యాఖ్యలు సరి కాదని ఆయన కొట్టి పారేశారు. వృద్ధ నాయకులకు ప్రజా స్పందన తెలియదని, ప్రజల్లోకి వెళ్తే వాస్తవాలు తెలుస్తాయన్నారు. ఎక్కడో కూర్చొని మాయమాటలు చెప్పితే ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు.












Click it and Unblock the Notifications