మెజారిటీ కడప జిల్లా ఎమ్మెల్యేలు వైయస్ జగన్ వైపే

తనకు రాజశేఖరరెడ్డి రాజకీయ జీవితం ఇచ్చారని, అందువల్ల తాను జగన్ ఓదార్పు యాత్రలో పాల్గొంటానని ఆయన చెప్పారు. ఆయన మంగళవారం జగన్ ఓదార్పు యాత్రలో పాల్గొనే అవకాశం ఉంది. సోమవారం ఓదార్పు యాత్రలో అహ్మదుల్లా కుమారుడు అస్రఫ్ పాల్గొన్నారు. కడప జిల్లా జమ్మలమడుగు శాసనసభ్యుడు ఆదినారాయణ రెడ్డి, రాయచోటి శాసనసభ్యుడు శ్రీకాంత్ రెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, కోడూరు శాసనసభ్యుడు శ్రీనివాసులు, బద్వేలు ఎమ్మెల్యే కమలమ్మ సోమవారంనాటి ఓదార్పు యాత్రలో పాల్గొన్నారు. కడప జిల్లా పరిషత్ చైర్ పర్సన్ జ్యోతిరెడ్డి జగన్ కు కలిసి సంఘీభావం తెలిపారు. కడప డిసిసి అధ్యక్షుడు సురేష్ బాబు ఓదార్పు యాత్రలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications