సిఎం రోశయ్యకు జగన్ వర్గం ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి లేఖాస్త్రం

సిఎల్పీలో ఎవరు పడితే వారు మీడియా సమావేశం ఏర్పాటు చేసి దివంగత నేత వైయస్ పై విమర్శలు చేయవచ్చా అని శ్రీకాంత్ రెడ్డి అడిగారు. సిఎల్పీ వేదికగా వారు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. వారి విమర్సలు పార్టీ ప్రయోజనాలకు మంచిది కాదని ఆయన అన్నారు. పార్టీ ప్రయోజనాలకు విరుద్ధంగా ఎవరు మాట్లాడినా తప్పేనని ఆయన అన్నారు.
దివంగత నేత వైయస్ పై విమర్శలు చేస్తున్నారనే బాధతోనే తాను ముఖ్యమంత్రికి లేఖ రాశానని, ఇందులో మరో ఉద్దేశం లేదని ఆయన అన్నారు. వివాదం సృష్టించి మీడియాకు ఎక్కడం కూడా తన ఉద్దేశం కాదని ఆయన అన్నారు. ఈ విషయంలో తనకు షోకాజ్ నోటీసు ఇచ్చినా సిద్ధంగానే ఉన్నట్లు ఆయన మీడియా ప్రతినిధులతో చెప్పారు.












Click it and Unblock the Notifications