కొత్త డిజిపిగా అరవింద రావు నియామకం

ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా సరిదిద్దగల సమర్ధత అరవిందరావుకు ఉందని కేంద్ర హోంమంత్రి చిదంబరం కూడా కితాబు ఇచ్చిన నేపథ్యంలో ఈ మేరకు నియామకం జరిగినట్లు తెలియవచ్చింది. 1977లో ఐపీఎస్కు ఎంపికైన అరవిందరావు విజయవాడ కమిషనరేట్కు మొదటిసారిగా కమిషనర్గా బాధ్యతలు చేపట్టారు. తర్వాత 1999-2002 వరకు హైదరాబాద్ అదనపు సీపీగా పనిచేశారు. తన సర్వీసులో వివిధ పదవులను సమర్ధవంతంగా నిర్వహించిన అరవిందరావు రాష్ట్రపతి పతకంతోపాటు అనేక పురష్కారాలు అందుకున్నారు.












Click it and Unblock the Notifications