నెల్లూరు జిల్లా నేతలపై వైయస్ జగన్ క్యాంప్ ఒత్తిడి

వైయస్ జగన్ ఓదార్పు యాత్ర ఈ నెల 15వ తేదీ నుంచి ప్రకాశం జిల్లా పొరుగునే ఉన్న నెల్లూరు జిల్లాలో ప్రారంభమవుతుంది. పదవుల్లో ఉన్నవారికి జగన్ ఓదార్పు యాత్రలో పాల్గొనేందుకు ఇబ్బందులుండొచ్చని జగన్ ను బలపరుస్తున్న నెల్లూరు కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్రెడ్డి అన్నారు. యాత్ర రోడ్ మ్యాప్పై నెల్లూరులో ముఖ్య నేతలతో మేకపాటి చర్చించారు. ఓదార్పు యాత్ర విజయవంతానికి చేసేందుకు కాంగ్రెస్ నేతలు, వైఎస్ఆర్ అభిమానులతో చర్చిస్తున్నామన్నారు. శాసనసభ్యుడు మేకపాటి చంద్రశేఖర రెడ్డి జగన్ ఓదార్పు యాత్రలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారు.












Click it and Unblock the Notifications