కాంగ్రెసుతో తెగదెంపులకు కడప ఎంపి వైయస్ జగన్ రెడీ

YS Jagan
హైదరాబాద్: కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కాంగ్రెసు పార్టీతో తెగదెంపులకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రకాశం జిల్లా ఓదార్పు యాత్రలో జగన్ చేసిన వ్యాఖ్యలు ఆ విషయాన్ని బలపరుస్తున్నాయని అంటున్నారు. 'ప్రజలు నాకు కొండంత అండ, కొన్ని శక్తులు నన్ను ఒంటరి చేయడానికి కుట్ర పన్నుతున్నాయి.నన్ను అభిమానించే ప్రజల కోసం దేశంలో ఏ శక్తినైనా ఎదుర్కొంటాను' అని జగన్ సోమవారం అన్నారు. ఈ వ్యాఖ్యలపై పార్టీలో వీటిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అధిష్టానాన్ని ధిక్కరిస్తూ ఓదార్పు యాత్రను నిర్వహిస్తున్న జగన్ పార్టీతో తెగదెంపులు చేసుకునే ధోరణితోనే గత రెండు రోజులుగా మాట్లాడుతున్న తీరు పట్టిస్తోందని అంటున్నారు. వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి చేసిన వ్యాఖ్య అందుకు నిదర్శమని అంటున్నారు.

ప్రకాశం జిల్లా యాత్రలో ప్రజా ప్రతినిధులు పాల్గొనకుండా నివారించడంలో అధిష్టానం విజయం సాధించడంతో జగన్ వర్గంలో అసహనం పెరగుతోందని అంటున్నారు. ప్రకాశం జిల్లాలో యాత్రపై ఎన్నో జగన్ వర్గం ఎన్నో ఆశలు పెట్టుకుంది. అయితే ప్రజాప్రతినిధులు పాల్గొనే విషయంలో నిరాశ ఎదురు కావడంతో ఆ వర్గంలో అసహనం పెరుతోందని అంటున్నారు. ప్రకాశం జిల్లా ప్రజాప్రతినిధులలో మంత్రి బాలినేని, శివప్రసాదరెడ్డి మాత్రమే ఓదార్పులో పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలో ఒక సామాజిక వర్గం హవా ఎక్కువగా ఉండడం, మంత్రి బాలినేని ఆధిపత్యం జిల్లాలో కొనసాగుతుండడంతో ఇక్కడ తమకు ఎదురే ఉండదని, అధిష్ఠానం మాటను పెడచెవిన పెట్టి తమ వెంట ప్రజా ప్రతినిధులందరూ వస్తారని జగన్ వర్గం ఊహించిందని, కానీ అందుకు విరుద్ధమైన పరిణామాలు ప్రకాశంలో చోటుచేసుకోవడంతో జగన్ శిబిరం కలవరపడుతోందని చెబుతున్నారు. త్వరలోనే పార్టీ క్రమశిక్షణా కమిటీ సమావేశం జరగనున్న నేపథ్యంలో జగన్‌పై ఎలాంటి చర్యలు ఉంటాయోనన్న విషయం ఉత్కంఠగానే ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+