సిఎం పోస్టుకు పోటీ: పురంధేశ్వరి వర్సెస్ జైపాల్ రెడ్డి

అధిష్టానం మనసెరిగిన నాయకులు ఆ పదవి కోసం తీవ్రంగా పోటీ పడుతున్నారు. శాసనసభ పక్ష నేత జె. గీతారెడ్డితో పాటు శాసనసభా స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఈ పోటీలో ఉన్నారు. దళిత మహిళ కావడం గీతారెడ్డికి ప్లస్ పాయింట్ అవుతోంది. రాయలసీమకు చెందిన కిరణ్ కుమార్ రెడ్డి జగన్ ను ఎదుర్కోవడం తనకు సులభమవుతుందని అధిష్టానాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణకు కె. జానారెడ్డి కూడా తీవ్రంగా ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడుతున్నట్లు చెబుతున్నారు. పోటీ మాత్రం కేంద్ర మంత్రులు ఎస్ జైపాల్ రెడ్డి, దగ్గుబాటి పురంధేశ్వరి మధ్య ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. జైపాల్ రెడ్డి సీనియర్ కావడం, తెలంగాణకు చెందినవాడు కావడం వల్ల ఆయన పేరును పరిగణనలోకి తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. జగన్ సామాజిక వర్గానికి చెందినవాడు కావడం కూడా ఆయన పేరును అధిష్టానం పరిశిలీస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, పురంధేశ్వరిని కూడా కొట్టిపారేయకూడదనే ఉద్దేశంతో అధిష్టానం ఉంది. ఎన్టీఆర్ వారసత్వం ఆమె వల్ల కలిసి వస్తుందని, దాని వల్ల చంద్రబాబును ఎదుర్కోవడం సులభమవుతుందని అధిష్టానం భావిస్తున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications