బాలినేని శ్రీనివాస రెడ్డికి షాక్: వెళ్లిపోయి మాట్లాడాలని హెచ్చరిక

ఓదార్పు యాత్రకు పెద్ద ఎత్తున జనం తరలి వస్తున్నారన్న వాదనను తాము పట్టించుకోవడం లేదనీ, అది చాలా పాత విషయమని కొట్టిపారేశారు. ఒకవైపు ముఖ్యమంత్రి అనారోగ్యం, మరోవైపు జగన్ దూకుడు నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ పరిస్థితులు నానాటికీ దిగజారుతున్నాయి కదా? అని విలేకరులు అన్నప్పుడు 'మాకు లేని ఆందోళన మీకెందుకు' అని ఎదురు ప్రశ్న వేశారు. ఇప్పుడు ఎలాంటి ఆందోళనకర పరిస్థితులు లేవని, దేన్ని ఎలా నియంత్రించాలో తమకు బాగా తెలుసని ధీమా వ్యక్తం చేశారు. మొత్తానికి జగన్ అధిష్ఠానాన్ని ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేస్తూ తనపై పార్టీ చర్య తీసుకొనేలా చేసుకొని, ఆ సానుభూతితో బయటికెళ్లాలని వేసుకున్న పథకాన్ని పారనీయకూడదనేది ఏఐసీసీ ఉద్దేశంగా ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications