ఆస్తుల గొడవ: వైయస్ జగన్ వర్సెస్ చంద్రబాబు నాయుడు

రాజశేఖర రెడ్డిపై, ఆయన కుమారుడు వైయస్ జగన్ పై తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న ఆరోపణలపై కాంగ్రెసు నాయకులు జగన్ కు బాసటగా నిలబడడం లేదు. నిజానికి, కాంగ్రెసులోని జగన్ వ్యతిరేకులు వైయస్ హయాంలోని నిర్ణయాలపై ప్రశ్నిస్తూనే ఉన్నారు. కాంగ్రెసులోని అంతర్గత శత్రువులను తిప్పి కొట్టడానికి ప్రయత్నిస్తూ వస్తున్న జగన్ వర్గంపై తెలుగుదేశం పార్టీని కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో చంద్రబాబు ఆస్తులపై వారు చర్చను ముందుకు తెచ్చారు. మలేషియా, సింగపూర్ ల్లో చంద్రబాబు హోటళ్లపై, హెరిటేజ్ పై దృష్టి సారించారు. చంద్రబాబుపై ఎదురు దాడికి దిగారు. కాంగ్రెసు రాయచోటి శాసనసభ్యుడు శ్రీకాంత్ రెడ్డి చంద్రబాబుపై, రామోజీపై తీవ్ర ఆరోపణలు చేశారు. నిజానికి, తమ తమ ఆస్తులపై వైయస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నిండు శాసనసభలో పరస్పరం తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వైయస్ జగన్ ఆస్తులే కాకుండా చంద్రబాబు ఆస్తులు కూడా పెరిగాయనేది నిజమని రాజకీయ వర్గాలంటున్నాయి.












Click it and Unblock the Notifications