కేంద్రపాలిత ప్రాంతంగా హైదరాబాద్ పరిశీలన: వికె దుగ్గల్

VK Duggal
హైదరాబాద్: హైదరాబాద్ పై రాష్ట్ర పరిస్థితిపై అధ్యయన చేస్తున్న శ్రీకృష్ణ కమిటీ సభ్య కార్యదర్శి వికె దుగ్గల్ సంచలన వ్యాఖ్య చేశారు. హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించే విషయంపై పరిశీలన జరుపుతున్నామని ఆయన గురువారం ఓ ప్రైవేట్ టీవీ చానెల్ తో అన్నారు. ప్రతి సమస్యకు సంబంధించిన ప్రతి కోణాన్నీ పరిశీలిస్తున్నామని ఆయన అన్నారు. తమ పని 95 శాతం పూర్తయిందని ఆయన చెప్పారు. తమ నివేదిక పూర్తి నిష్పక్షపాతంగా ఉంటుందని ఆయన అన్నారు. తాము సమస్యపై నిర్ణయం చేయబోమని, రాష్ట్ర విభజన సమస్యను పరిష్కరించుకోవాల్సింది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలేనని ఆయన అన్నారు.

అంతర్యుద్ధం జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు చేసిన ప్రకటనను పరిశీలనలోకి తీసుకోవడం లేదని ఆయన అన్నారు. అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరిగేలా చూస్తామని ఆయన అన్నారు. సంప్రదింపుల ప్రక్రియ పూర్తయిందని ఆయన చెప్పారు. ఎపిపిఎస్సీ గొడవను పరిగణనలోకి తీసుకుంటారా అని అడిగితే మొత్తం విద్యారంగాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తామని, ఉద్యోగనియామకాలను, పరీక్షలను అన్నింటినీ పరిగణనలోకి తీసుకుని విశ్లేషిస్తామని ఆయన సమాధానమిచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+