Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

విశాఖలో వరంగల్ విద్యార్థిపై దాడి:వరంగల్ లో నిరాహార దీక్ష

Sabbam Hari
విశాఖపట్నం:లాయర్ల ఉద్యమం సద్దుమణిగిన తర్వాత మరో ప్రాంతీయ వాద ఉద్యమం చోటు చేసుకుంది. ఐతే ఇంతకుముందులా లాయర్లు, యూనివర్సిటీ, పార్టీ ఉద్యమాల నుంచి ఇప్పుడు కొత్త ప్రాంతీయతత్వం చోటు చేసుకుంది. విశాఖలోని ఓ కళాశాలలో వరంగల్ కు చెందిన నరేష్ అనే విద్యార్థిని గుర్తు తెలియని విద్యార్థులు రాత్రి వచ్చి తెలంగాణ వాడు ఇక్కడ చదవకూడదని, మీకు ఇక్కడ ఉండే అర్హత లేదని, నువ్వు తెలంగాణలోనే చదువుకోవాలని ఇక్కడికి వచ్చే అర్హత లేదని నరేష్ ను కించపరిచినట్టు బాధితుడు చెప్పాడు. కలత చెందిన ఆ విద్యార్థి అక్కడి నుండి వచ్చి వరంగల్ లో నిరాహార దీక్షకు పూనుకున్నాడు.

విద్యార్థిని ఎవ్వరూ ఏమీ అనలేదని, డబ్బులు కట్టలేకనే నరేష్ వెళ్లిపోయాడని యాజమాన్యం అంటోంది. అసలు అతనికి అయన తరగతి గది కూడా తెలియదని కేవలం సర్టిఫికెట్లు మాత్రమే అడిగాడని, ఫీజు చెల్లించక పోవడంతో తాము ఇవ్వలేదని అన్నారు. తమ విద్యార్థులు ఎవ్వరు కూడా నరేష్ ను అవమానపరిచలేదని అన్నారు.

నరేష్ వెనుక రాజకీయశక్తుల హస్తం ఉండవచ్చని ఎంపీ సబ్బం హరి అనుమానం వ్యక్తం చేశారు. ఆయన చెబుతున్నవి నిజాలు కాక పోవచ్చన్నారు. ఇక్కడ అలాంటి చర్యలకు పాల్పడే వారు లేరని అన్నారు. ఒకవేళ అలాంటిది ఐతే తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నారు. నరేష్ ను అవమానపరిచటం అంతా ఉత్తిదేనని ఎంపీ లగడపాటి రాజగోపాల్ వ్యాఖ్యానించారు. నిజంగానే అలాంటి అవమానం జరిగిందని సదరు విద్యార్థి నిరూపిస్తే కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని,ఈ విషయమై నరేష్ తనను కలిస్తే సమస్య పరిష్కరిస్తానన్నారు. కేవలం ప్రాంతీయతత్వం రెచ్చగొట్టడానికే ఇలాంటి చర్యలకు పూనుకుటున్నారన్నారు. ఇలాంటి ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొట్టడం తమ ప్రాంతంలో లేదన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+