అంబటి హయాంలో ఎపిఐఐసి ఎమ్మార్ స్కామ్ నిజమే
ఒప్పందాల ఉల్లంఘన ఎలా జరిగిందో కూడా ఈనాడు దినపత్రిక వివరంగా రాసింది. అక్రమాలకు రాచబాట వేయడానికి ఎంజిఎఫ్ అనే సంస్థను ముందుకు తెచ్చినట్లు కూడా ఆరోపించింది. తన హక్కులన్నింటినీ ఎంజీఎఫ్కు కట్టబెట్టి దానికి మళ్లీ తానే పూచీకత్తుగా నిలబడే బదులు.. అసలు ఎమ్మార్హిల్స్ సంస్థే నేరుగా బ్యాంకు రుణం తీసుకునే వెసులుబాటు ఉండగా ఆ మార్గాన్ని ఎందుకు వినియోగించుకోలేదు? దీన్నిబట్టి చూస్తుంటే- ఎంజీఎఫ్ తనతో నిధులు తెస్తుందని కాదు, దాని ద్వారా నిధులను బయటకు దండుకునేందుకే ఎంజీఎఫ్ను రంగం మీదికి తెచ్చారని అర్థమవుతోందని నిపుణుల కమిటీ నిర్ధారణకు వచ్చినట్లు వివరించింది. ఎమ్మార్ హిల్స్ లోకి 2005 మేలోనో ఫెయిర్ బ్రిడ్జి హోల్డింగ్స్ అనే మూడో సంస్థను పట్టుకొచ్చేందుకు ప్రయత్నించారని ఈనాడు రాసింది. ఎమ్మార్లోనూ, ఎంజీఎఫ్లోనూసీనియర్ ఉద్యోగులంతా ఒకరే కావటం చూస్తే కేవలం ఎమ్మార్హిల్స్ జాయింట్ వెంచర్లో నిథులను కొల్లగొట్టేందుకు, ఏపీఐఐసీని కేవలం రబ్బర్స్టాంపు సంస్థగా మార్చేందుకే ఎమ్మార్ పథకం వేసిందని స్పష్టమవుతోందని నిపుణులు నిర్ధారణకు వచ్చారు.
ఏపీఐఐసీ తరఫున ఎమ్మార్హిల్స్ సంస్థలో నామినీ డైరెక్టర్గా వ్యవహరించిన బి.పి.ఆచార్య వ్యవహార శైలిపై సొలిసిటర్ జనరల్ సందేహాలు వ్యక్తం చేశారని ఈనాడు దినపత్రిక రాసింది. ఏపీఐఐసీ నుంచి ఎటువంటి అనుమతులూ తీసుకోకుండానే ఎమ్మార్హిల్స్ సంస్థ గృహవాణిజ్య సముదాయాల అభివృద్ధి బాధ్యతలను, ఆర్థిక లావాదేవీల హక్కులను ఎంజీఎఫ్కు కట్టబెడుతున్నా ఆ బోర్డులో ఏపీఐఐసీ నామినీ డైరెక్టర్గా ఉన్న బి.పి.ఆచార్య ఏం చేస్తున్నట్లని సొలిసిటర్ జనరల్ వ్యాఖ్యానించారని తెలిపింది.