వైయస్ జగన్ మంత్రులకు మరింత వెసులుబాటు

రోశయ్య ముఖ్యమంత్రి పదవి చేపట్టి ఏడాది పూర్తయింది. ఇప్పటికీ ఆయన దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ఏర్పాటు చేసుకున్న మంత్రివర్గంతోనే కాలం వెళ్లదీస్తూ వస్తున్నారు. మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ చేపట్టడానికి రోశయ్యకు కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని అంటున్నారు. అయినా రోశయ్య అందుకు పూనుకోవడం లేదని సీనియర్ శాసనసభ్యుల్లో కొంత నిర్లిప్తత చోటు చేసుకుంది. జెసి దివాకర్ రెడ్డి, కె. జానారెడ్డి, డిఎల్ రవీంద్రారెడ్డి, పి. శంకరరావు, మర్రి శశిధర్ రెడ్డి వంటి సీనియర్లు పలువురు మంత్రివర్గంలో చోటును ఆశిస్తున్నారు. మంత్రివర్గం పునర్వ్యస్థీకరణలో జాప్యం జరుగుతుండడంతో బాలినేని శ్రీనివాస రెడ్డికి, పిల్లి సుభాష్ చంద్రబోస్ కు ఇప్పటికిప్పుడే ఉద్వాసన పలికే స్థితి లేదు. ఇది వారికి చాలా వరకు ఊరటనిచ్చే విషయమే.












Click it and Unblock the Notifications