హైదరాబాద్ లో రెడ్ అలర్ట్: భారీగా పోలీసుల మోహరింపు

Hyderabad
హైదరాబాద్: ఆందరూ ఉత్కంఠతతో ఎదురు చూస్తున్న అయోధ్య - బాబ్రీ వివాదం గురువారం మధ్యాహ్నం గం.3.30 ని.లకు తీర్పు వెలువడుతున్నందున ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పటిష్ట చర్యలు తీసుకుంది. ముఖ్యంగా రాజధాని హైదరాబాద్ మొత్తం పోలీసులు మోహరించారు. నగరంలో 30వేల పోలీసు బలగాలను మోహరించారు. 48 బాంబుస్క్వాడ్, 40 స్నిప్పర్ డాగ్స్ కంపెనీలు, 6 ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కంపెనీలు, 45 ఫ్లటూన్ల ఏఆర్ పోలీసులు, 35 మంది డిసీపీలు, 25 మంది ఏఎస్పీలు మోహరించారు. హైదరాబాద్ లో 375 అతి సున్నితమైన ప్రదేశాలను, 740 సమస్యాత్మక ప్రదేశాలను పోలీసులు గుర్తించారు.

హైదరాబాద్ నగరం మొత్తం బంద్ ప్రాంతాన్ని తలపిస్తుంది. అవసరాన్ని బట్టి అదనపు పోలీసు బలగాలను సిద్ధంగా ఉంచారు. పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్నం నుండి రాత్రి 10 గంటల వరకు మద్యం దుకాణాలు మూసివేయించారు. ఎవరైనా హింసాయుత ఘటనలకు పాల్పడితే కఠినచర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. 500 మంది అనుమానితులను పోలీసును ఆదుపులోకి తీసుకున్నారు. పలుచోట్ల యజమానులు దుకాణాలు స్వచ్ఛందంగా మూసివేస్తున్నారు.

తీర్పు ఎలా వచ్చినా అందరూ శాంతియుతంగా ఉండాలని మతపెద్దలు, ప్రభుత్వం, పోలీసు అధికారులు, మీడియా ఎప్పటికప్పుడు ప్రజలను కోరుతుంది. సహనం పాటించాలంటూ సామరస్యంతో మెలగాలంటూ పలు సంఘాలు శాంతి ర్యాలీలు తీస్తున్నాయి. విజయవాడలో విద్యార్థులతో శాంతిర్యాలీ నిర్వహించారు. భరతమాత, వివిధ మత పెద్దల రూపంలో విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. హిందూ ముస్లిం భాయీ భాయీ, భారత సమైఖ్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+