Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వైయస్ జగన్మోహన్ రెడ్డికి అధిష్టానం మరో షాక్

YS Jagan
హైదరాబాద్: కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి పార్టీ నాయకత్వం మరో భారీ షాక్ ఇచ్చింది. అక్టోబరు 2న గాంధీజయంతి రోజున సమావేశంలో చేసిన తీర్మానంపై పిసిసి సీరియస్ అయ్యింది. దీంతో తిరుపతి పట్టణ కాంగ్రెసు అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డికి పార్టీ నుండి షోకాజ్ నోటీసులు వచ్చాయి. జగన్ చేపడుతున్న ఓదార్పు యాత్రకు అనుకూలంగా జిల్లాలో పార్టీని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నావంటూ దానికి సమాధానం చెప్పాలని పార్టీనుండి షోకాజ్ నోటీసులు వచ్చాయి.

జగన్ వర్గీయుడైన నెల్లూరు జిల్లాకు చెందిన మరో నేతకు ఏకంగా పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేసి అంతకంటే ఎక్కువ షాక్ ఇచ్చింది. నెల్లూరు జిల్లాకు చెందిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ పదవినుంచి తొలంగించడంతో పాటు ఆయన పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రద్దు చేసింది. ఇటీవల ఆనం వివేకానందరెడ్డిపై, అనంతరం ప్రభుత్వానికి, రోశయ్యకు వ్యతిరేకంగా కోటంరెడ్డి చేసిన వ్యాఖ్యలకు మండిపడ్డ పిసిసి ఆయనను పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేసింది.

జగన్ ఓదార్పును సమర్థిస్తూ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని మాట్లూడుతున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడానికైనా వెనకాడమని మూడు రోజుల క్రితం జరిగిన పార్టీ సమావేశంలో పిసిసి అధ్యక్షుడు డి.శ్రీనివాస్ వ్యాఖ్యలు చేశాడు. అందుకు తగ్గట్టుగానే నాయకత్వం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై చర్యలు తీసుకుంటోంది. అంబటి రాంబాబుతో మొదలైన వేటుల పర్వం పార్టీ నాయకత్వం కొనసాగిస్తోంది. నాయకత్వం జగన్ వర్గీయుల మాటలపై కొంత చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నప్పటీకీ వారి మాటలు శృతిమించటంతో వారిపై వేటుకు సిద్ధమవుతోంది.

టిటిడి మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపైన, వరంగల్ జిల్లా శాయంపేట ఎమ్మెల్యే కొండా సురేఖపైనా చర్యలు తీసుకునే దిశలో నాయకత్వం ఆలోచిస్తుంది. ముఖ్యమంత్రి రోశయ్యను తప్పుపడుతూ కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ఇక కొండా సురేఖ పార్టీని భూస్థాపితం చేస్తానని చెప్పటంపై పార్టీ జిల్లా నాయకుడు ఒకరు ఆమెపై చర్యలు తీసుకోవాల్సిందిగా అధినాయకత్వాన్ని కోరారు.

దీనిపై స్పందించిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జగన్ ఓదార్పుకు తాను అనుకూలంగా ఉన్నందువల్లనే తనపై వేటు వేసిందని ఆయన ఓ టీవీ షోలో ఫోన్ ద్వారా చెప్పారు. తను ఏ తప్పు చేయలేదని, ఏదైనా తప్పు చేసినట్టు పార్టీ అధినాయకత్వం నిరూపిస్తే తాను ఏ శిక్షకైనా సిద్ధం అని ఆయన అన్నారు. తాను ఏ నాయకుడికి వ్యతిరేకినిగాని ఆనుకూలుడను గాని కాదని, ముప్పై ఏళ్లుగా పార్టీలో పని చేస్తున్నానని, తన గురించి జిల్లా ప్రజలకు తెలుసునన్నారు. జగన్ ఓదార్పు కాంగ్రెసు కే లాభమని, కాంగ్రెసు కు లాభించే ఏ కార్యక్రమంలోనైనా తాను పాల్గొనడానికి సిద్ధమేనన్నారు. తనపై వేటు వేసిన నాయకులు జిల్లాకు వచ్చి తాను కాంగ్రెసు కు చేసిన సేవల గురించి ప్రజలను ఆడగాల్సిందిగా సవాల్ చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+