హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్మోహన్ రెడ్డికి మాజీమంత్రి మారెప్ప బాసట

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: ప్రస్తుత కాంగ్రెసు పాలనలో పార్టీ కార్యకర్తలు పూర్తి నిరాశ, నిస్పృహలలో కూరుకుపోతున్నారని మాజీమంత్రి మారెప్ప విలేకరుల సమావేశంలో అన్నారు. కాంగ్రెసు పార్టీకి చిత్తశుద్ధితో పనిచేసిన కార్యకర్తలకు ఖాళీగా ఉన్న నామినేటెడ్ పదవులని ఇచ్చి వారిలో ఉత్సాహం నింపాలని ఆయన పార్టీ నాయకత్వాన్ని కోరారు. ఒక వర్గాన్ని దృష్టిలో పెట్టుకోకుండా పార్టీ కోసం పని చేసిన వారికి పదవులు అప్పజెప్పాలని ఆయన సూచించారు.

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిని విమర్శించి, జగన్మోహన్ రెడ్డిని తిట్టిన వారికి పార్టీ ఆఘమేఘాల మీద పార్టీ పదవులు కట్టబెడుతుందని ఆయన ఆరోపించారు. రోశయ్య పాలనలో మంత్రులు పని చేయడం లేదన్నారు. మంత్రులు దేనిని పట్టించుకోవటం లేదన్నారు. మంత్రులు పని చేయక పోవటంతో అధికారులు మోనార్కుల్లా వ్యవహరిస్తున్నారని అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X