వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వరంగల్ లో దారుణం : భార్య గొంతు కోసి చంపిన భర్త

By Srinivas
|
Google Oneindia TeluguNews

Warangal
వరంగల్: భార్య ఆడపిల్లను కన్నదని ఓ మృగాడు కట్టుకున్న భార్య గొంతుకోసి కిరాతకంగా చంపిన ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్ మండలంలోని చిట్యతండాలోని సురేష్ కు మంగమ్మతో కొంతకాలం క్రితం వివాహం అయ్యింది. అయితే మంగమ్మ రెండునెలల క్రితం ఓ ఆడ శిశువుకు జన్మనిచ్చింది. దీంతో ఆగ్రహం చెందిన సురేష్ అప్పటినుంచి మంగమ్మను వేధిస్తున్నాడు.

చివరకు గురువారం అర్ధరాత్రి ఆమె గొంతుకోసి చంపాడు. అనంతరం సురేష్ పారిపోయాడు. చంపాడానికి ముందు వారిద్దరి మధ్య పాప విషయంలో గొడవ జరిగినట్లు సమాచారం.దీంతో రెండునెలల పాప అనాథగా మిగిలిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న సురేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.మంగమ్మ మరణం, అనాథగా మారిన శిశువును చూసి స్థానికంగా విషాదం నెలకొంది.మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టంకు తరలించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X