కాంగ్రెసు నాయకత్వంపై వైయస్ జగన్ క్యాంప్ ఎదురుదాడి

Mekapati Rajamohan Reddy
నెల్లూరు: ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) నాయకత్వంపై కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వర్గం నాయకులు ఎదురుదాడికి దిగారు. తమపై చర్యలు తీసుకున్నా తాము వెనక్కి తగ్దేది లేదని స్పష్టం చేస్తున్నారు. తమపై పిసిసి తీసుకుంటున్న చర్యలను ప్రశ్నిస్తున్నారు. సస్పెన్షన్లతో నెల్లూరు జిల్లాలో వైయస్ జగన్ ఓదార్పు యాత్ర ఆగదని, నెల్లూరు జిల్లాలో ఓదార్పు యాత్ర జరుగుతుందని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి శుక్రవారం స్పష్టం చేశారు. ఈ నెల 11వ తేదీ నుంచి నెల్లూరు జిల్లాలో జగన్ ఓదార్పు యాత్ర జరుగుతుందని ఆయన చెప్పారు. సస్పెన్షన్లు తమపై ప్రభావం చూపబోవని ఆయన అన్నారు. తమపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని ఆయన చెప్పారు.

వైయస్ జగన్ ఓదార్పు యాత్ర కోసం బహిష్కృత నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం యజ్ఞం జరిగింది. ఈ సమావేశంలో వైయస్ జగన్ ఓదార్పు యాత్రలో పాల్గొనాలని ప్రతిజ్ఞ చేశారు. జగన్ ఓదార్పు యాత్రపై పిసిసి నాయకత్వం తీరును, తమపై పిసిసి తీసుకుంటున్న చర్యలను కోటంరెడ్డి శ్రీధర రెడ్డి తప్పు పట్టారు. ఓదార్పు యాత్ర పార్టీని బలోపేతం చేస్తుందని ఆయన అన్నారు. వైయస్ జగన్ ఓదార్పు యాత్రలో సోనియా, రాహుల్ గాంధీలు పాల్గొంటే బాగుంటుందని ఆయన అన్నారు.

యాగం తర్వాత జగన్ వర్గానికి చెందిన కాంగ్రెసు నాయకులు, కార్యకర్తలు సమావేశమయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+