వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణపై జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నివేదికనే ఫైనల్

By Pratap
|
Google Oneindia TeluguNews

BN Srikrishna
న్యూఢిల్లీ: తెలంగాణపై జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నివేదికపై ఆధారపడే నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెసు నేతృత్వంలోని ఐక్య ప్రగతిశీల కమిటీ (యుపిఎ) ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు అర్థమవుతోంది. రాష్ట్ర పరిస్థితిపై అధ్యయనానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ కమిటీ ఈ ఏడాది డిసెంబర్ లోగా తన నివేదికను సమర్పించనుంది. రాష్ట్ర విభజన అంశంపై కమిటీ క్షుణ్నంగా పరిశీలిస్తోంది. తాము రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు ఆమోదయోగ్యంగా ఉండే నివేదికను సమర్పిస్తామని శ్రీకృష్ణ కమిటీ సభ్య కార్యదర్శి వికె దుగ్గల్ పదే పదే చెబుతున్నారు. అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే సిఫార్సును కమిటీ ఎలా చేస్తుందనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. ఎవరికి తోచిన అభిప్రాయాలు వారు చెబుతున్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికు అందరూ కట్టుబడి ఉండాలని కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం, కాంగ్రెసు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ రాయలసీమ హక్కుల వేదిక నాయకుడు, కాంగ్రెసు శాసనసభ్యుడు టిజి వెంకటేష్ కు స్పష్టం చేశారు.

టిజి వెంకటేష్ గురువారం మొయిలీని, చిదంబరాన్ని కలిసి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికకు అందరూ కట్టుబడి ఉండాలని ఆ ఇద్దరు నేతలు తనకు చెప్పినట్లు టిజి వెంకటేష్ చెప్పారు. దీన్ని బట్టి శ్రీకృష్ణ కమిటీ చేసే సిఫార్సుల మేరకే కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై నిర్ణయం తీసుకుంటుందని స్పష్టమవుతోంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనే డిమాండ్ ను సీమాంధ్ర నాయకులు వ్యతిరేకిస్తున్నారు. తమకు రాష్ట్రం కావాల్సిందేనని తెలంగాణవాదులు డిమాండ్ చేస్తున్నారు. ఈ స్థితిలో కమిటీ ఇచ్చే నివేదికపై ఊహాగానాలు చెలరేగుతున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X